బిపర్ జాయ్​ బాధితులకు అండగా ఎల్ఐసీ

బిపర్ జాయ్​ బాధితులకు అండగా ఎల్ఐసీ
  • క్లెయిమ్స్ దరఖాస్తులకు పలు మినహాయింపులు
  • ప్రత్యేకంగా పోర్టల్​ ఏర్పాటు 

న్యూఢిల్లీ: గుజరాత్, రాజస్థాన్ లలో బిపర్ జాయ్ తుఫాను బాధితులకు అండగా ఉంటామని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ‌‌) ప్రకటించింది. క్లెయిమ్​ల దరఖాస్తు విధానాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు వాటిని వేగంగా పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించింది. ఎల్ఐసీ పాలసీలతో పాటు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన స్కీమ్ లకు పలు మినహాయింపులు కల్పించినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. బాధితులకు అందుబాటులో ఉండేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నోడల్ అధికారులుగా నియమించినట్లు వెల్లడించింది. బిపర్ జాయ్ బాధితులు  క్లెయిమ్​లు సమర్పించేందుకు ప్రత్యేకంగా ఓ పోర్టల్​ ను కూడా ఏర్పాటు చేసినట్లు ఎల్ఐసీ చైర్మన్​ సిద్ధార్థ మొహంతి తెలిపారు.