- నెట్ ప్రీమియం ఇన్కం రూ. 1.07 లక్షల కోట్లు
ముంబై: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) లాభం సెప్టెంబర్ 2023 క్వార్టర్లో సగానికి తగ్గిపోయింది. అంతకు ముందు ఏడాది క్యూ2 లో ఎల్ఐసీ లాభం రూ. 15,952 కోట్లు, కాగా తాజా రెండో క్వార్టర్లో ఇది రూ. 7,925 కోట్లకు పడిపోయింది. సెప్టెంబర్ 2022 లో అకౌంటింగ్ పాలసీలో మార్పులు చేశామని, అందువల్ల ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ సరైనది కాదని ఎల్ఐసీ ఒక స్టేట్మెంట్లో తెలిపింది. తాజా సెప్టెంబర్ క్వార్టర్లో ఎల్ఐసీ ప్రీమియం ఇన్కం కూడా 19 శాతం తగ్గి రూ. 1.07 లక్షల కోట్లకు చేరింది.
అంతకు ముందు ఏడాది క్యూ2 లో ఈ ప్రీమియం ఇన్కం రూ. 1.32 లక్షల కోట్లు. గ్రాస్ ఎన్పీఏ సెప్టెంబర్ 2022 క్వార్టర్లోని 5.6 శాతం నుంచి ఈ సెప్టెంబర్ క్వార్టర్లో 2.43 శాతానికి తగ్గాయి. నెట్ఎన్పీఏలలో ఎలాంటి మార్పూ లేదని ఎల్ఐసీ ప్రకటించింది. పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయం తాజా క్యూ2 లో రూ. 93,942 కోట్లకు పెరిగిందని వెల్లడించింది. రిజల్ట్స్ ప్రకటన నేపథ్యంలో ఎల్ఐసీ షేరు బీఎస్ఈలో శుక్రవారం 0.68 శాతం తగ్గి రూ. 610.55 వద్ద క్లోజయ్యింది.