బెంగళూరు: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన తేలికపాటి యుద్ధ విమానం(ఎల్సీఏ) తొలి ట్విన్ సీటర్ తేజస్ యుద్ధ విమానంను హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(హల్) ఇండియన్ ఎయిర్ఫోర్స్కు బుధవారం అందజేసింది.
బెంగళూరులోని హల్ హెడ్ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీర్ చౌధరి పాల్గొన్నారు. ఎయిర్ఫోర్స్ శిక్షణ అవసరాలకు అనుగుణంగా దీన్ని ట్విన్ సీటర్స్గా డెవలప్ చేశామని, ఎమర్జెన్సీలో ఇది పూర్తిస్థాయి యుద్ధ విమానంగా పనిచేస్తుందని హల్ తెలిపింది.
ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా హల్ దశల వారీగా మొత్తం18 ట్విన్ సీటర్ తేజస్యుద్ధ విమానాలను తయారు చేయనుంది.