హేమ్లానాయక్ తండాలో మేకల దొంగతనం

హేమ్లానాయక్ తండాలో మేకల దొంగతనం

లింగంపేట,వెలుగు: గాంధారి మండలం హేమ్లానాయక్​ తండాలో కాంసోత్​ మోహన్ కు చెందిన ఆరు మేకలు దొంగతనానికి గురైనట్లు  స్థానిక ఎస్​ఐ ఆంజనేయులు తెలిపారు.​మోహన్​14 మేకలను  మంగళ వారం రాత్రి  ఇంటి పక్కన గల కొట్టంలో ఉంచాడు.

బుదవారం ఉదయం లేచి చూడగా ఆరు మేకలు కన్పించక పోవడంతో  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్​ఐ తండాకు వెళ్లి  మేకలు దొంగిలించబడ్డ  కొట్టంను పరిశీలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లుతెలిపారు.