కృష్ణా, గోదావరి లింక్​ మూర్ఖపు ఆలోచన: కోదండరాం

కృష్ణా, గోదావరి లింక్​ మూర్ఖపు ఆలోచన: కోదండరాం

హైదరాబాద్​, వెలుగు: కృష్ణా, గోదావరి అనుసంధానం మూర్ఖపు ఆలోచన అని, దాని వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని టీజేఎస్​ అధ్యక్షుడు ప్రొఫెసర్​ కోదండరాం అన్నారు. శనివారం హైదరాబాద్​లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొట్లాడి, బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణలోని నీటిని ఎట్లా దానం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఎడారిగా మార్చాలన్న ఆలోచనను తాము ఒప్పుకోబోమన్నారు. రాష్ట్రంలోని నీటి వనరులను రాయలసీమకు తరలిస్తే ఊరుకునేది లేదని, నదుల అనుసంధానం పేరుతో కేసీఆర్​ చేస్తున్న రాజకీయ డ్రామా, అవినీతిపై మరో పోరాటం చేస్తామన్నారు.