
ప్రతి ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. నెలకు రెండు సార్లు ఏకాదశి తిథి వస్తుంది. ఏడాదిలో మొత్తం 24 ఏకాదశిలు వస్తాయి. వైశాఖమాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. ఈ ఏడాది మోహిని ఏకాదశి మే 8 వ తేది వచ్చింది. ఆ రోజున విష్ణువుకి సంబంధించిన మోహిని రూపాన్ని పూజిస్తే ఆనందం .. శ్రేయస్సు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజు ఎలా పూజ చేయాలి.. పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం. . . .
ఏకాదశి తిథి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. మోహిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండి తులసి చెట్టును పూజించాలి. దీని వలన జీవితంలో ఆనందం.. శ్రేయస్సు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. హిందూ క్యాలండర్ ప్రకారం ఈ ఏడాది మోహిని ఏకాదశి మే 8 వ తేది వచ్చింది.
మోహిని ఏకాదశి శుభముహూర్తం:
- మోహిని ఏకాదశి తిథి ప్రారంభం : మే 7 ఉదయం 10.19 గంటలకు
- మోహిని ఏకాదశి తిథి ముగింపే : మే 8 మధ్యాహ్నం 12.29 గంటలకు
- ఉదయం తిథిని పరిగణనలోకి తీసుకుంటారు కావున మే 8 వ తేదీన మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు.
Also Read : పెళ్లికి ఆటంకాలు వస్తున్నాయా..
మోహిని ఏకాదశి రోజున విష్ణుమూర్తిని అమ్మవారిని పూజించాలి. మోహిని విష్ణువు రూపం. . ఉపవాస దీక్షను పాటించి ఆ రోజు అంతా స్వామిధ్యానంలో గడపాలి. విష్ణుసహస్రనామం పఠించాలి. స్వామి వారికి పచ్చని పండ్లను.. పసుపు రంగు స్వీట్లను నివేదించాలి.
మోహిని ఏకాదశి నాడు ఏమి చేయాలి?
- సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి. స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి. లేదంటే ఉతికిన బట్టలైనా కట్టుకోవచ్చు.
- దేవుని మందిరం దగ్గర మోహిని అవతారమైన విష్ణుమూర్తి చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోవాలి. గంగా జలం ఉంటే ఆ స్థలాన్ని శుద్ది చేసుకోండి.
- విష్ణుమూర్తికి... అమ్మవారికి తులసి దళాల దండను సమర్పించండి. అయితే ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో తులసి చెట్టును ముట్టుకోరాదు. ముందు రోజే కోసి ఆకులను శుభ్రమైన ప్రదేశంలో భద్రపర్చుకోవాలి.
- విష్ణుమూర్తి చిత్ర పటాన్ని పసుపు.. కుంకుమ.. గంధంతో అలంకారం చేయాలి. స్వామివారికి పసుపురంగు వస్త్రాలు కట్టాలి.
- మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని...పూజించాలి. విష్ణు సహస్రనామం చదవాలి. లేకపోతే భక్తితో వినాలి. పూజలో తులసి దళాలను తప్పని సరిగా ఉపయోగించాలి.
- ఎందుకంటే మోహినికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం.
- మోహిని ఏకాదశి ఉపవాసం పాటించేవారు సాత్వికంగా ఉండాలి.
- ముందు రోజు నుంచి అంటే దశమి తిథి( మే 7 ) నుంచే సాత్విక ఆహారాన్ని తినాలి.
- ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆవును సేవించండి. వాటికి పచ్చి గడ్డిని ఆహారంగా అందించండి.
- మోహిని ఏకాదశి రోజున పూజ తర్వాత, తమ శక్తి మేరకు ధాన్యాలు, బెల్లం, డబ్బు దానం చేయాలి.
మే 8 వ తేది ఈ పనులు అస్సలు చేయొద్దు..
- తులసి చెట్టును తాకరాదు. ఆరోజు తులసి చెట్టుకు నీళ్లు పోయరాదు. ఎందుకంటే ఏకాదశి రోజు తులసీ మాత ఉపవాస దీక్షను పాటిస్తుంది.
- మోహిని ఏకాదశిరోజు ఉపవాసం ఉండాలి. ఆరోగ్య కారణాల రీత్యా ఉండలేని వారు పాలు.. పండ్లు తీసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో బియ్యంతో వండిన పదార్థాలను తినకూడదు.
- ఏకాదశి రోజు నల్లని రంగు బట్టలు వేసుకోకూడదు.
- పెద్దలను.. స్త్రీలను.. ఎవరిని కూడా అమానపరచకూడదు. హేళనగా మాట్లాడకూడదు.
- ఎవరి పట్ల చెడుగా ప్రవర్తించకూడదు.
- అసభ్యకరంగా మాట్లాడకూడదు. పొగాకు.. జరదా వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. సిగరెట్.. లిక్కర్.. మాంసాహారానికి దూరంగా ఉండాలి.