లిక్కర్ స్కామ్ పూర్తిగా అబద్ధం.. అంతా నిరాధారం : కేజ్రీవాల్

లిక్కర్ స్కామ్ పూర్తిగా అబద్ధం.. అంతా నిరాధారం : కేజ్రీవాల్

మద్యం కుంభకోణం పూర్తిగా అబద్ధమని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టుపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించారు. వారి వద్ద ఒక్క సాక్ష్యం కూడా లేదు, ప్రతిదీ నిరాధారమైనదేనని ఖండించారు.

"మమ్మల్ని ఇంతగా విచారించారు, ఏమైనా బయటకు వచ్చిందా? మద్యం కుంభకోణం అంతా అబద్ధం. ఒక్క పైసా కూడా మారలేదు. సుప్రీంకోర్టులో జడ్జి సాక్ష్యం అడిగారు కానీ వారి వద్ద ఏదీ లేదు. కొన్ని రోజులకు మద్యం కుంభకోణం కనిపించకుండా పోతుంది. ఆ తర్వాత వారు మళ్లీ మరో టాపిక్ తో ముందుకు వస్తారు. వారు తాము పని చేయరు లేదా మరెవరినీ పని చేయనివ్వరు”అని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.

ALSO READ : వచ్చేస్తోంది : 8 లేదా 10న ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్

విపక్ష నేతలపై భయాందోళనలు రేకెత్తించేందుకు వారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, రాజకీయ నాయకులే కాకుండా వ్యాపారవేత్తలను కూడా టార్గెట్ చేస్తున్నారని కేజ్రీవాల్ చెప్పారు. ఇలాంటి భయానక వాతావరణం దేశ ప్రగతికి మంచిది కాదని ముఖ్యమంత్రి అన్నారు.