బీసీ బాలుర హాస్టల్‌లో ఉప్మాలో బల్లి

బీసీ బాలుర హాస్టల్‌లో ఉప్మాలో బల్లి

మొన్నటివరకూ గురుకుల హాస్టళ్లల్లో ఫుడ్ పాయిజన్ లు జరిగిన ఘటనలు మరవకముందే నారాయణపేట జిల్లాలో తాజాగా ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్లో ఉదయం వండిన ఉప్మా టిఫిన్ లో బల్లి కనిపించింది. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. టిఫిన్ చేసిన వారిలో ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. అనంతరం వారిని జిల్లా ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నా.. ఇప్పటికీ ఫుడ్ పాయిజన్ లాంటి ఘటనలు ఏదో ఒక చోట వినిపిస్తూనే ఉన్నాయి. గత రెండు నెలల నుంచి ఈ తరహా ఘటనలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.