ఓయూ,వెలుగు : ఓయూ బీఈడీ హాస్టల్ మెస్ లో టిఫిన్ చట్నీలో బల్లి రావడంతో విద్యార్థులు భయాందోళన చెందారు. అప్పటికే అదే చట్నీతో ఇడ్లీలు తిన్న కొందరు విద్యార్థులు భయంతో హెల్త్సెంటర్కు పరుగులు తీశారు. అనంతరం చీఫ్వార్డెన్ఆఫీసు వద్ద ఆందోళనకు దిగిన ఘటన బుధవారం ఉదయం జరిగింది. ఏబీవీపీ నేత రాజు మాట్లాడుతూ బీఎడ్హాస్టల్ మెస్లో పలు సమస్యలు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. చట్నీలో బల్లి పడిన చట్నీ తిన్న ఓ విద్యార్థి అస్వస్థతకు గురయ్యాడని, పరిస్థితి విషమించి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటే బాధ్యులెవరని ప్రశ్నించారు. అధికారుల పర్యవేక్షణ లోపం, కేర్టేకర్ హుస్సేన్, మెస్వర్కర్ల నిర్లక్ష్యంగానే జరుగుతుందని ఆరోపించారు.
హాస్టల్ కేర్ టేకర్హుస్సేన్ నిజామ్కాలేజీ హాస్టల్ మెస్కు కూడా ఇన్ చార్జిగా వ్యవహరిస్తూ బీఈడీ హాస్టల్ సమస్యలను పట్టించుకోవడం లేదని, అడిగితే విద్యార్థులతో దురుసుగా ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. 230 మంది విద్యార్థులు ఉన్నారని, మెస్లో శుభ్రత లేదని కాలేజీ ప్రిన్సిపాల్ కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఓయూ హాస్టల్స్చీఫ్వార్డెన్కొర్రెముల శ్రీనివాస్, కాలేజీ ప్రిన్సిపాల్ మెస్ను తనిఖీ చేశారు. మెస్ లోని నలుగురు సిబ్బందిని మరో హాస్టల్కు బదిలీ చేశారు. మెస్ కేర్ టేకర్ హుస్సేన్పై శాఖాపరమైన చర్యలకు అధికారుల రిపోర్ట్ చేస్తామని చెప్పారు. చట్నీ తయారు చేసే సమయంలోనే బల్లి పడిందా..? లేక ఎవరైనా కావాలనే చేశారా ? అనే అనుమానాలు ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చీఫ్వార్డెన్కొర్రెముల శ్రీనివాస్తెలిపారు.