లాక్ డౌన్ ఎఫెక్ట్: రేపటి నుంచి యాదగిరిగుట్టలో దర్శనాలు బంద్

లాక్ డౌన్ ఎఫెక్ట్: రేపటి నుంచి యాదగిరిగుట్టలో దర్శనాలు బంద్

రేపటి (బుధవారం- 12) నుంచి ఈ నెల 21 వరకు యాదాద్రిలో భక్తుల దర్శనాలు నిలిపి వేస్తున్నట్లు ఆలయ వర్గాలు ప్రకటించాయి. రేపు ఉదయం 10 గంటల వరకే దర్శనాలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశాయి. అలాగే స్వామివారి నిత్య కైంకర్యాలు అంతరంగికంగా యథావిధిగా కొనసాగనున్నాయి. బుధవారం నుంచి  తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ..ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ వర్గాలు చెప్పాయి.