LJP ఎంపీ ప్రిన్స్‌రాజ్ పై అత్యాచారం కేసు

LJP ఎంపీ ప్రిన్స్‌రాజ్ పై అత్యాచారం కేసు

లోక్‌ జనశక్తి పార్టీ (LJP) ఎంపీ ప్రిన్స్‌రాజ్‌పై ఢిల్లీలో అత్యాచారం కేసు నమోదైంది. ప్రిన్స్‌రాజ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ.. మూడు నెలల క్రితం LJP మహిళా కార్యకర్త ఒకరు ఫిర్యాదు చేశారు. ప్రిన్స్‌రాజ్ గతేడాది తనకు మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చి అత్యాచారం చేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో తెలిపారు. ఈ క్రమంలోనే ఈ నెల 9న కోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు కన్నౌట్ స్టేషన్ పోలీసులు ఎంపీపై అత్యాచారం, సాక్ష్యాల ధ్వంసం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తనపై కేసు నమోదు కావడంతో ముందస్తు బెయిలు కోరుతూ ఎంపీ ప్రిన్స్ రాజ్ నిన్న(మంగళవారం) కోర్టును ఆశ్రయించారు.