అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు లియో

అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు లియో

‘మాస్టర్’ మూవీ విజయం తర్వాత  విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబోలో రూపొందుతోన్న చిత్రం ‘లియో’. త్రిష హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అర్జున్‌‌, సంజయ్‌‌దత్‌‌, ప్రియా ఆనంద్‌‌, మన్సూర్ అలీఖాన్‌‌, గౌతమ్ మీనన్‌‌, మిస్కిన్‌‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శుక్రవారంతో ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తయింది. 

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన దర్శకుడు లోకేష్.. ‘ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడానికి 125 రోజుల సమయం పట్టింది. దీనికి సపోర్ట్ చేసిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్. వీరంతా మనసు పెట్టి చేసిన సినిమా ఇది.   ఈ జర్నీ నాకు వ్యక్తిగతంగా చాలా దగ్గరైంది. గర్వంగా ఉంది అబ్బాయిలు’ అంటూ తన టీమ్‌‌తో ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు.  

సెవెన్ స్ర్కీన్ స్టూడియో బ్యానర్‌‌‌‌పై లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అక్టోబర్ 19న సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన విజయ్ లుక్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచాయి.