- బడులకు పంపిన పరీక్షల విభాగం అధికారులు
హైదరాబాద్, వెలుగు: టెన్త్ రెగ్యులర్, ఒకేషనల్ స్టూడెంట్లకు లాంగ్ మెమోలు అందనున్నాయి. మే నెలలో జరిగిన పబ్లిక్ పరీక్షల్లో పాసైన, ఆగస్టులో జరిగిన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో పాసైన విద్యార్థుల మెమోలను ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు స్కూళ్లకు పంపించారు.
అన్ని హైస్కూళ్లకు స్పీడ్ పోస్టు ద్వారా టెన్త్ లాంగ్ మెమోలు పంపించామని, విద్యార్థులు వాటిని హెడ్మాస్టర్ల ద్వారా తీసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. అన్యువల్ పరీక్షల్లో పాసైన 4,53,201 మంది, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో పాసైన 38,477 మంది మెమోలను స్కూళ్లకు పంపించామని చెప్పారు.
ఎవరివైనా మిస్ అయితే తమకు తెలియజేయాలన్నారు. మెమోలు స్టూడెంట్లకు ఇచ్చేటప్పుడు రిజిస్టర్ మెయింటేన్ చేయాలని, వారితో సంతకాలు తీసుకోవాలని హెడ్మాస్టర్లకు సూచించారు. పబ్లిక్ పరీక్షలు పూర్తయి 5 నెలలు దాటిన తర్వాత బడులకు లాంగ్మెమోలు చేరుతుండటం గమనార్హం.