జీడిమెట్ల, వెలుగు: రెడీమిక్స్ లారీ ఢీకొని ఓ బైకర్ మృతిచెందాడు. అల్వాల్లోని యాదమ్మనగర్ కు చెందిన కిషన్ చంద్(38) గుండ్లపోచంపల్లిలోని ఫార్చూన్ ఆర్ట్ ఫ్యాక్టరీలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తుంటాడు. మంగళవారం సాయంత్రం ఫ్యాక్టరీలో పని ముగించుకుని బైక్పై ఇంటికి వెళ్తున్నాడు. ఈక్రమంలో దూలపల్లి ఛర్మాస్ రోడ్డులోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే ఓ రెడీమిక్స్ లారీ వెనక నుంచి అతని బైక్ను ఢీకొట్టింది. అతడు కిందపడిపోగా పైనుంచి లారీ వెళ్లడంతో స్పాట్లో చనిపోయాడు.
