బస్సులను ఢీకొన్న లారీ.. నలుగురు మృతి

బస్సులను ఢీకొన్న లారీ.. నలుగురు మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్రిష్ణగిరి జిల్లా  సులగిరి లో.. రోడ్డు పక్కన ఆగి ఉన్న రెండు RTC బస్సులను లారీ ఢీకొంది. వివరాల్లోకి వెలితే.. హోసూర్ నుంచి క్రిష్ణగిరి వెళ్తున్న ఓ RTC బస్సు టైర్ పంక్చర్ అయింది. దీంతో మరో బస్సును ఆపి ప్రయాణీకులను ఆ బస్సులోకి ఎక్కిస్తున్నారు. అయితే.. వెనకాలనుండి వేగంతో వచ్చిన లారీ.. రోడ్డుపై ఆగివున్న రెండు బస్సులను ఢీకొట్టి.. ప్రయాణీకులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు గాయపడగా.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు, మరో వక్తి చనిపోయారు.