ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. పది మందికి తీవ్ర గాయాలు

ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. పది మందికి తీవ్ర గాయాలు

హన్మకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరేపల్లి దర్గా సమీపంలో ఆర్టీసీ బస్సు లారీని బలంగా ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా అరుపులు, కేకలు వేస్తూ భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.  బస్సులో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. దీంతో తనని కాపాడాలంటూ అర్థనాలు పెట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఈ ప్రమాదం వల్ల ములుగు- హనుమకొండ ప్రధాన రహదారిపై రెండు కిలోమీటర్ల మేరా వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జాం అవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.