వేర్వురు ప్రాంతాల్లో ప్రేమ జంటల ఆత్మహత్యయత్నం

వేర్వురు ప్రాంతాల్లో ప్రేమ జంటల ఆత్మహత్యయత్నం

యాదాద్రి జిల్లా భువనగిరి ఖిల్లాపై ఓ ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరిస్తారో…లేదో అనే భయంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. వీరిని సిద్దిపేట జిల్లా.. కడవేరుకు చెందిన నవీన్, వేచరేగికి చెందిన స్వాతిలుగా గుర్తించారు. నిన్న ఇంటి నుంచి వచ్చేసిన యువతీ, యువకుడు.. రాత్రి భువనగిరిలోనే గడిపినట్లు తెలుస్తోంది. ఉదయం భువనగిరి గుట్టపై పురుగుల మందు తాగి స్నేహితులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. నవీన్, స్వాతిల పరిస్థితి విషమంగా ఉండటంతో.. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కు తరలించారు.

నిజామాబాద్ లో..

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అలిసాగర్ పార్కులో ప్రేమ జంట ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. వీరిలో యువతి చనిపోగా, యువకుడి పరిస్థితి సీరియస్ గా ఉంది. కొంత కాలంగా ప్రేమించుకుంటున్న మోహన్, నవనిత.. ఇంట్లో  పెద్దలకు ప్రేమ విషయం చెప్పడంతో ఒప్పుకోలేదని తెలుస్తోంది. దీంతో.. ఉదయం పార్కుకు చేరుకున్న ప్రేమికులు కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో.. పార్కు సిబ్బంది ఇద్దరినీ జిల్లా హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ యువతి నవనీత చనిపోయింది. మోహన్ పరిస్థితి సీరియస్ గా ఉంది.