ప్రేమజంట అనుమానాస్పద మృతి

ప్రేమజంట అనుమానాస్పద మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ప్రేమజంట అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. రామాంజనేయ కాలనీలో జరిగిన ఈ ఘటన విషాదం నింపింది. ఐదేళ్లుగా రామాంజనేయ కాలనీకి చెందిన మాచర్ల వినోద్, తేజస్విని ప్రేమించుకుంటున్నారు. అయితే అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం వినోద్ కి ఇచ్చి పెళ్లి చేయటానికి ఇష్ట పడలేదు. వారి కూతురిని కూడా ఇంటి నుంచి పంపించినట్లు చెబుతున్నారు. దీంతో వినోద్ తోనే తేజస్విని కలిసి ఉంటోంది. సోమవారం తెల్లవారుజామున ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ప్రేమికులిద్దరూ కాలి బూడిదయ్యారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమకు పెద్దలు అంగీకరించలేదన్న కారణంతో ఆత్మహత్య చేసుకున్నారా లేక.. అగ్ని ప్రమాదం జరిగిందా అని ఆరా తీస్తున్నారు.