- మోడిఫై చేసి కమర్షియల్ గూడ్స్ తరలింపు
- ఆర్టీఏ తనిఖీల్లో బయటపడుతున్న ప్రైవేటు బస్సుల డొల్లతనం
- మూడు రోజుల్లో 143 కేసుల నమోదు, ఆరు బస్సులు సీజ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: కర్నూలు బస్సు ప్రమాదం ఘటన నేపథ్యంలో మూడు రోజులుగా ఆర్టీఏ అధికారులు గ్రేటర్ లో ప్రైవేట్బస్సుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో ప్రైవేటు బస్సుల డొల్లతనం బయటపడుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్జిల్లాల్లో సోమవారం కూడా తనిఖీలు చేసి, 54 కేసులు నమోదు చేయడంతో పాటు ఒక బస్సు సీజ్చేశారు. అలాగే, 1.20 లక్షల జరిమానా విధించారు.
ఈ సందర్భంగా కొందరు ప్రైవేట్బస్సుల నిర్వాహకులు బస్సు సీట్లను మోడిఫై చేసి ఎక్కువ సీట్లను అమరుస్తున్నట్టు తెలుసుకున్నారు. బస్సు కింది భాగంలో కమర్షియల్గూడ్స్, ప్రయాణికుల సామగ్రి కూడా ట్రాన్స్పోర్ట్చేస్తున్నారు. దీని కోసం ప్రయాణికుల సీట్ల కింది వైపు ప్రత్యేకంగా పెద్ద అరనే ఏర్పాటు చేస్తున్నారు.
దీంతో లగేజీ బరువు, ప్రయాణికుల బరువు కలిసి లోడ్ పెరిగిపోతోంది. మూడు రోజులుగా నిర్వహిస్తున్న తనిఖీల్లో ఇప్పటి వరకూ 143 కేసులు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. జరిమానాగా 3.06 లక్షలు వసూలు చేయగా, 5 బస్సులను సీజ్ చేసినట్టు ఆర్టీఏ అధికారులు తెలిపారు.
