జూన్ 20న పార్టీ చీఫ్ ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ!

జూన్ 20న పార్టీ చీఫ్  ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ!

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం పార్టీ అగ్రనేతలతో భేటీ కానున్నారు. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అపాయింట్​మెంట్​ కోరినట్లు సమాచారం. ఈ భేటీలో తాజా మంత్రి వర్గ విస్తరణ, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, నెలాఖరులో లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్, క్షేత్రస్థాయిలో మరింతగా పార్టీ బలోపేతం ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

 అనంతరం పార్టీ అగ్రనేత రాహుల్, పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇతర నేతలను కలిసే అవకాశం ఉన్నట్టు సీఎంఓ వర్గాలు ద్వారా తెలిసింది. రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని సాయంత్రం హైదరాబాద్​కు తిరిగి రానున్నట్టు సమాచారం.