
ఖైరతాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి బాధ్యుడు మాజీ సీఎం కేసీఆర్నే అని అతనిని అరెస్టు చేసి జైలులో పెట్టాలని మా తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కె.వీరారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడేళ్లుగా తమ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
తప్పుడు లెక్కలు చూపించి బ్యాంక్లు, ఆర్థిక సంస్థల నుంచి కేసీఆర్ అప్పులు తెచ్చాడన్నారు. ఆయా సంస్థలు ఎలాంటి వివరాలు చూడకుండా కేసీఆర్ ఇచ్చిన ముడుపులతో నిధులిచ్చారని ఆరోపించారు. దీనిపై ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి సిట్ఏర్పాటు చేయాలని, అంతకుముందు కేసీఆర్ను అరెస్టు చేసి జైలులో పెట్టాలని వీరారెడ్డి కోరారు. సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు బి.నాగరాజు, సెక్రటరీలు జి.క్రాంతి,మహేశ్తదితరులు పాల్గొన్నారు.