
మాదాపూర్, వెలుగు: మాదాపూర్ సిద్ధిక్నగర్లో డీసీపీ డాక్టర్ వినీత్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో నాలుగు బెల్టు షాపులను గుర్తించి రూ.1.20 లక్షల విలువైన 305 లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకొని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఐదు ఇండ్లలో రూ.లక్ష విలువైన గుట్కా, పొగాకు సీజ్ చేశారు. అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని 21 పెద్ద, 20 చిన్న సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. సరైన డాక్యుమెంట్లు లేని 46 బైకులు, ఒక కారు, మూడు ఆటోలను సీజ్ చేశారు.