జీహెచ్ఎంసీ నిధులను కాళేశ్వరానికి పంపి హైదరాబాద్కు కేసీఆర్ అన్యాయం చేసిండు: మధుయాష్కీ గౌడ్

జీహెచ్ఎంసీ నిధులను కాళేశ్వరానికి పంపి హైదరాబాద్కు కేసీఆర్ అన్యాయం చేసిండు: మధుయాష్కీ గౌడ్

ఎల్బీనగర్, వెలుగు: గత బీఆర్​ఎస్​ పాలనలో కేసీఆర్​ జీహెచ్​హెచ్ఎంసీ నిధులను కాళేశ్వరం ప్రాజెక్టుకు మళ్లించి హైదరాబాద్ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా అన్యాయం చేశారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. ఎల్​బీ నగర్ మన్సూరాబాద్ డివిజన్ బాలాజీ నగర్ పార్కును ఆయన మంగళవారం సందర్శించి మార్నింగ్ వాకర్స్ తో మాట్లాడారు. పార్కులో రూ. 50 లక్షలతో వాచ్ మెన్ గది, టాయిలెట్స్, పిల్లల ఆట వస్తువులు, ఓపెన్ జిమ్ ను ఇటీవల మంజూరు చేయించి పనులు పూర్తిచేసినందుకు కాలనీవాసులు మధుయాష్కీకి కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ సందర్భంగా మధుయాష్కీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీ నిధులను ఇక్కడే ఖర్చు చేస్తూ మౌలిక వసతులు కల్పిస్తోందన్నారు. ఓపెన్ జిమ్ లో ఫ్లోర్ మ్యాట్ ఏర్పాటు చేయకపోవడంతో ఆయన అధికారులకు ఫోన్ చేసి సీరియస్​ అయ్యారు. అనంతరం ఆటోనగర్ లోని జింకల పార్కు ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బుడ్డ సత్యనారాయణ, నాయకులు భీమిడి రామకృష్ణారెడ్డి, సుధాకర్ గౌడ్, కళ్లెం నరసింహారెడ్డి, రమేశ్​ నాయక్, దాము మహేందర్ యాదవ్, కొండోజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.