బాలీవుడ్ హిట్ నెంబర్కు స్టెప్పులేసిన సంజయ్ ,మాధురీ

బాలీవుడ్ హిట్ నెంబర్కు స్టెప్పులేసిన సంజయ్ ,మాధురీ

'అఖియ మిలావూ కబీ అఖియా చురావ్.. క్యా తూనే కియా జాదూ' సాంగ్ 90లలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. 1995లో సంజయ్ కపూర్, మాధురీ దీక్షిత్ జంటగా నటించిన బాలీవుడ్ మూవీ రాజాలోని ఈ హిట్ నెంబర్ అప్పట్లో పెళ్లిళ్లు, ఫంక్షన్లలో ఎక్కువగా వినిపించేది. తాజాగా ఓ పార్టీలో కలిసిన సంజయ్, మాధురీలు ఈ సాంగ్కు స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకున్నారు. సాంగ్ ప్రారంభమైన వెంటనే డ్యాన్స్ ఫ్లోర్పై హుక్ స్టెప్స్తో అదరగొట్టారు. జెలీనియా, రితేష్ దేశ్ముఖ్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ కూడా అటెండైన ఈ పార్టీకి సంబంధించిన వీడియో క్లిప్ను సంజయ్ కపూర్ తన ఇన్స్టాలో షేర్ చేశారు. బ్యాక్ టు నైంటీస్, వాట్ ఏ నైట్ అనే క్యాప్షన్ తో చేసిన ఈ పోస్ట్ చూసిన వారి అభిమానులు సంబరపడుతున్నారు. 

For more news..

భర్త నుంచి విడిపోయిన మరో నటి

శ్రీవారి భక్తులకు శుభవార్త