- కోడ్ ఉల్లంఘించారంటూ సీఎస్ఈకి మధుసూదనాచారి ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించి రెచ్చగొట్టేలా మాట్లాడారని, ఆయనపై చర్యలు తీస్కోవాలని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ను శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి డిమాండ్ చేశారు. గురువారం ఆయన బీఆర్ఎస్ నేతలతో కలిసి సీఈవో సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
జూబ్లీహిల్స్లో ఓడిపోతే పదవి పోతుందన్న భయంతో.. బీఆర్ఎస్కు ఓటేస్తే పథకాలు పోతాయని బెదిరిస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిష్పక్షపాతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ మైనారిటీ లీడర్ షకీల్ ఇంటికెళ్లి కాంగ్రెస్ కార్యకర్తలు బెదిరింపులకు దిగారన్నారు. స్థానిక పోలీసులు, డీసీపీలు, ఏసీపీలు, అక్కడుండే రమేశ్నాయక్ ఎవరి కనుసన్నల్లో పనిచేస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి అధికారులతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉందన్నారు.
