బైపోల్ ఆపేందుకే కేసీఆర్ మోడీని కలిశాడు

బైపోల్ ఆపేందుకే కేసీఆర్ మోడీని కలిశాడు

హుజురాబాద్ బైపోల్ ఆపాలని మోడీ కాళ్ళు పట్టుకునేందుకు కేసీఆర్ ఢిల్లీ వెళ్లారన్నారు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్. పశ్చిమబెంగాల్, ఒడిశాలో ఎన్నికల నిర్వహణకు లేని అభ్యంతరాలు... హుజురాబాద్ ఉపఎన్నికకే ఎందుకు కనబడ్డాయని ప్రశ్నించారు. బండి సంజయ్ ది గమ్యం లేని యాత్ర అన్నారు మధుయాష్కీ. ఈటల మోడీ కాళ్ల దగ్గర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. ఆస్తులు కాపాడుకునేందుకే బీజేపీలో చేరారన్నారు. రాయికల్ లో దళిత ఆత్మగౌరవ సభకు వెళ్తూ జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంట్లో  ఆగారు మధుయాష్కీగౌడ్.