హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలియజేశారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలను మధ్యప్రదేశ్ సీఎంకి రేవంత్ వివరించారు.
