మోదీ రోడ్ షోలో అపశృతి.. కుప్పకూలిన స్టేజ్

మోదీ రోడ్ షోలో అపశృతి..   కుప్పకూలిన స్టేజ్

ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలో అపశృతి చోటుచేసుకుంది.  మధ్యప్రదేశ్‌లో బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జబల్‌పూర్‌లో రోడ్‌షోతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక  కుప్పకూలింది . కటంగా-గోరఖ్‌పూర్ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.  ఈ ఘటనలో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

అంతకుముందు జబల్‌పూర్‌లో ప్రధాని మోదీ రోడ్‌షో నిర్వహించారు. ప్రధానిని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. రోడ్‌షో షహీద్ భగత్ సింగ్ క్రాసింగ్ నుండి 1.2 కి.మీ- రూట్‌లో జరిగింది. జబల్‌పూర్‌లోని గోరఖ్‌పూర్‌లోని ఆదిశంకరాచార్య క్రాసింగ్ వద్ద ముగిసింది. మధ్యప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 26, ఏప్రిల్ 26, మే 7, మే 13 తేదీల్లో  జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.