
ఖైరతాబాద్,వెలుగు: బీజేపీకి వ్యతిరేకంగా ఈనెల 21 నుంచి తెలంగాణలో మాదిగ జోడో యాత్ర ప్రారంభిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్మాజీ చైర్మన్పిడమర్తి రవి తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో రాష్ట్ర మాదిగ సంఘాల సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న రవి మాట్లాడుతూ ‘మాదిగల పంతం’ బీజేపీ అంతం పేరుతో సిటీలోని అమీర్పేట నుంచి యాత్ర ప్రారంభమై కరీంనగర్లో ముగుస్తుందని చెప్పారు.
ప్రధాని మోదీ వర్గీకరణను పక్కన పెట్టి రామ మందిరాన్ని ప్రారంభించారని విమర్శించారు. మాదిగలు బీజేపీ వైపు వెళ్లకుండా తాము అందరిని సంఘటిత పరుస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంఘం నేతలు నర్సింగరావు, యాదన్న, బాబూరావు, గోపాల్, సుదర్శన్పాల్గొన్నారు.