మహానంది ఆలయంలో ఎలుగుబంటి..

మహానంది ఆలయంలో ఎలుగుబంటి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా మహానంది ఆలయంలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. సెప్టెంబర్ 2వ తేదీ శనివారం తెల్లవారుజామున ఆలయం పరిసరాల్లో ఎలుగుబంటి సంచరించింది. పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలో నుంచి ఆలయ పరిసరాల్లోకి ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటిని చూసిన భక్తులు భయంతో కేకలు వేశారు.  

ఎలుగుబంటిని సమాచారాన్ని తెలుసుకున్న  మహానంది ఆలయ సిబ్బంది..స్థానికుల సహాయంతో ఎలుగుబంటిని పారదోలే ప్రయత్నం చేశారు. దీంతో ఎలుగుబంటి ఆలయ వసతి గృహానికి పక్కనే ఉన్న పంటపొల్లాల్లోకి వెళ్లినట్లు తెలిపారు.