వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపిస్తాం

వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపిస్తాం
  • నేతకాని(మహర్) సేవా సంఘం 
  • ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు ప్రకటనపై హర్షం
  •  సీఎం రేవంత్​రెడ్డి, ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ఫోటోలకు క్షీరాభిషేకం 

కోల్​బెల్ట్/నస్పూర్, వెలుగు :  పెద్దపల్లి కాంగ్రెస్ ​ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపిస్తామని, ఆయనకు నేతకాని కులస్తుల సంపూర్ణ మద్దతు ఉంటుందని నేతకాని(మహర్) సేవా సంఘం అధ్యక్షుడు దుర్గం స్వామి, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు దుర్గం నరేశ్ ​ప్రకటించారు. నేతకాని ప్రత్యేక కార్పొరేషన్​ ఏర్పాటుపై సీఎం ప్రకటనను హర్షిస్తూ నేతకాని కులస్తులు ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అందుగులపేటలో సీఎం, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ఫొటోలకు క్షీరాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా నస్పూర్​లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. నేతకాని సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రత్యేక కార్పొరేషన్ ​ఏర్పాటు అంశాన్ని  చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి..సీఎం రేవంత్​రెడ్డికి దృష్టికి తీసుకువెళ్లారన్నారు. తమ కులానికి తగిన న్యాయం, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని సీఎం హామీ ఇచ్చినందున, కాంగ్రెస్​కు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. గతంలో బీఆర్ఎస్ నుంచి నేతకాని సామాజిక వర్గానికి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలిచిన వ్యక్తులు తమ సొంత  లాభాన్ని చూసుకున్నారు తప్ప, నేతకాని సమాజం కోసం చేసిందేమీ లేదన్నారు. తమ సమాజాన్ని గుర్తించి న్యాయం చేసేందుకు కృషి చేస్తున్న చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి  కృతజ్ఞతలు తెలిపారు.

ప్రస్తుత బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కులాన్ని అడ్డుపెట్టుకొని పార్టీని మోసం చేసి టికెట్​ తెచ్చుకున్నాడని, ఇంతవరకు సొంత సామాజికవర్గానికి ఏమీ చేయలేదని, ఇక సమాజానికి ఏం చేస్తాడని ప్రశ్నించారు. గడ్డం వంశీకృష్ణని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నేతకాని కులస్తులకు పిలుపునిచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్ జాడి యేసయ్య, ప్రధాన కార్యదర్శి సిద్ధార్థ రామ్మూర్తి, ఉపాధ్యక్షుడు జనగామ తిరుపతి, దుర్గం గోపాల్, మాజీ సర్పంచ్​లింగాల మల్లయ్య, సునార్కర్ రాంబాబు, జాడి ప్రమీల, సునార్కర్, రాంబాబు, జాడి రాజమల్లు, కామెర లింగరాజు, సాంబయ్య, శంకర్, దుర్గం సాంతయ్య, రాంటెంకి పోషం, దుర్గం శ్రీనివాస్ పాల్గొన్నారు.