మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ డెంగ్యూతో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. తన చికిత్సను నిమిత్తం ఈ దీపావళి రోజున, అతను తన మద్దతుదారులను కలవలేనని చెప్పారు. ‘‘గత కొన్ని రోజులుగా డెంగ్యూతో బాధపడుతూ వైద్యుల సూచన మేరకు ట్రీట్మెంట్ తీసుకుని విశ్రాంతి తీసుకుంటున్నాను. వ్యాధి కారణంగా బలహీనత, అలసటగా అనిపించినా ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోంది.. పూర్తిగా కోలుకోవడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చు" అని పవార్ ఎక్స్లో పోస్ట్ చేశారు. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లవద్దని, మాస్క్లు ధరించాలని వైద్యులు సూచించారని ఆయన తెలిపారు.
"అనారోగ్యం కారణంగా బలవంతంగా అందరికీ దూరంగా ఉండటం బాధాకరం. ప్రతి సంవత్సరం దీపావళి నాడు మీ అందరినీ కలుస్తాను. దీపావళి పడ్వా స్నేహమిలానా సందర్భంగా, సమావేశాలు, శుభాకాంక్షలు పంచుకుంటానే వాడిని. డాక్టర్ సలహా మేరకు కొన్ని రోజులు ఈ సంవత్సరం కలవలేకపోతున్నాను. కానీ నా శుభాకాంక్షలు ఎల్లప్పుడూ మీకు ఉంటాయి. మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు దీపావళి శుభాకాంక్షలు" అని పవార్ చెప్పారు. దీపావళి మనందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు, ఐశ్వర్యం, మంచి ఆరోగ్యం తీసుకురావాలని కోరుకుంటున్నానని పవార్ తెలిపారు.
సాధారణంగా, దీపావళి నాడు, బారామతిలోని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంటికి ప్రజల శుభాకాంక్షలు అందుకోవడానికి పవార్ కుటుంబ సభ్యులందరూ కలిసి వస్తారు. అయితే, ఈ సంవత్సరం, అజిత్ పవార్ సీనియర్ పవార్తో లేకపోవడం, ఆ పార్టీ నుండి విడిపోయి ఎన్డీఏ ప్రభుత్వంలో చేరడం వల్ల కుటుంబ దృశ్యం భిన్నంగా ఉంది. ప్రత్యేక వర్గంగా ఏర్పడి ప్రభుత్వంలో చేరిన తర్వాత పవార్ కుటుంబం జరుపుకునే తొలి దీపావళి ఇది.
गेल्या काही दिवसांपासून मी डेंग्यूमुळे आजारी असून डॉक्टरांच्या सल्ल्यानं उपचार आणि सक्तीची विश्रांती घेत आहे. आजारामुळे अशक्तपणा, थकवा जाणवत असला तरी प्रकृतीत हळूहळू सुधारणा होत आहे. पूर्णपणे बरं होण्यास आणखी काही दिवस लागण्याची शक्यता आहे. डॉक्टरांनी गर्दीच्या ठिकाणी न जाण्याचा…
— Ajit Pawar (@AjitPawarSpeaks) November 8, 2023