బీఆర్ఎస్లోకి మాజీ సైనికులు..కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్

బీఆర్ఎస్లోకి మాజీ సైనికులు..కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్

బిఆర్ఎస్ పార్టీలో మహారాష్ట్ర మాజీ సైనికులు చేరారు. ఆ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మాజీ సైనిక సంఘాల నేతలు, మాజీ సైనికులు సీఎం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.  మహారాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన సైనికాధికారులకు సీఎం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా  అబ్ కి బార్ కిసాన్ సర్కార్ పిలుపునందుకొని రైతు రాజ్య స్థాపన కోసం దేశ జవాన్లు ముందుకు రావడం గొప్ప పరిణామమని సీఎం కేసీఆర్ అన్నారు. సాంప్రదాయ పద్ధతుల్లో ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న పాలనను సమూలంగా మార్పు చేసుకొని రైతుల సంక్షేమం, అభివృద్ధి, సబ్బండ వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. మహారాష్ట్రలో కూడా వీటిని అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పుకు దోహదం చేసే దిశగా మరోసారి వీర సైనికులై కర్తవ్య నిర్వహణను కొనసాగించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 

బీఆర్ఎస్ లో ఎవరెవరు చేరారంటే..

మహారాష్ట్ర నాసిక్ జిల్లాకు చెందిన ‘ఫౌజీ జనతా పార్టీ’ కార్యదర్శి, మాజీ సైనికుడు సునిల్ బాపురావు పగారె బిఆర్ఎస్ లో చేరారు. వీరితో పాటు సైన్యంలో పలు ర్యాంకుల్లో పనిచేసిన మాజీ సైనికాధికారులు, మాజీ కల్నళ్ళు, మాజీ లెఫ్టినెంటులు, పలువురు మాజీ సైనికులు గులాబీ కండువా కప్పుకున్నారు.  వీరిలో మాలెగావ్ నుంచి ప్రవీణ్ ఆనద్ థోకే,  నాసిక్ నుంచి సాగర్ మాగ్రే, పూణే నుంచి తుకారాం దఫద్, సోలాపూర్ నుంచి సునిల్ ఆంధారె, శిరూర్ నుంచి బబన్ పవార్, డోండ్ నుంచి సందీప్ లగడ్, బీడ్ నుంచి రాజేంద్ర కప్రే, దరాశివ్ నుంచి హరిదాస్ షిండే, సంగ్లి నుంచి శివాజీ నాయక్, జల్నానుంచి దినకర్ ధోడే, వాషిమ్ నుంచి అముల్ మపరి, సూరజ్ నామ్ దేవ్ రౌత్, అజింకియా రౌత్, నంద కుమార్ కడ్సే, అకోలా నుంచి మహేశ్ చౌహాన్, అహ్మద్ నగర్ నుంచి ఉమేశ్ హండే, హడప్సర్ నుంచి నారాయణ్ తోపే, నాగ్నాథ్ గోర్పడే, సంగ్లీ నుంచి రమేశ్ సాహెబ్, దోండ్ నుంచి జైనక్ సాహెబ్ తదితర మాజీ సైనికులు ఉన్నారు.