
మహారాష్ట్రలో కిరాయికి ఉంటున్న వారినుంచి ఇంటి యజమానులు మూడునెలల రెంట్ అడగకూడదని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కరోనా వైరస్ వ్యాపిస్తున్న కాలంలో దేశమంతా లాక్ డౌన్ లో ఉండగా పలువురి ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. దీంతో ఇంటికిరాయి కట్టుకోలేని పరిస్థితి ఏర్పడటంతో తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది. ఇందుకు గాను శుక్రవారం ఇంటి ఓనర్లను ఆదేశించింది.
దేశంలో ఎక్కువగా కరోనా బారిన పడ్డవారి సంఖ్య మహారాష్ట్రాలో నమోదైంది. ఇప్పటికే కరోనాను కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మే3 వరకు విధించింది కేంద్ర ప్రభుత్వం. మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో కరోనా బారిన పడిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. పేద ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆహార ధాన్యాలు అందజేయాలని మంత్రులను, ఆయా శాఖల అధికారులను ఆదేశించారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్.