
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల జలాశయాలపై ప్రభావం చూపుతున్నాయి. మహారాష్ట్రలో వరద ఉధృతి పెరగడంతో .. నీటి ప్రవాహం దిగువకు రావడం వలన... తెలంగాణ లోని ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. జూరాల.. శ్రీశైలం జలాశయాలు వరదతో నిండుతున్నాయి.
జూరాల డ్యాం నిండిపోవడంతో అధికారులు గేట్లు ఎత్తారు. దీంతో వరద నేరుగా శ్రీశైలం జలాశయానికి చేరుతుంది. ప్రస్తుతం జూరాల నుంచి శ్రీశైలానికి 60 వేల 587 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. వర్షాల తీవ్రతతో , ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటికి నిదర్శనం. డ్యామ్ నుంచి ప్రస్తుతానికి నీటిని వదలడంలేదని తెలిపారు .
శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న ఇన్ఫ్లో
ప్రస్తుతం శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 854.20 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 215.7080 టీఎంసీలు, ప్రస్తుతం 89.7132 టీఎంసీలకు చేరిందని అధికారులు వివరించారు.
విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం
శ్రీశైలం డ్యామ్ కుడి మరియు ఎడమ వైపు ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ప్రస్తుతం నిలిపివేశారు. ఇది ఒకవైపు ముందు జాగ్రత్తగా తీసుకున్న చర్య కాగా, మరోవైపు నీటి మట్టం పెరిగే దాకా విద్యుత్ ఉత్పత్తిని తిరిగి ప్రారంభించే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.