బషీర్బాగ్, వెలుగు: శ్రీ మహావీర్ జైన్ సేవా సంఘ్ ఆధ్వర్యంలో ఈనెల 31న భగవాన్ మహావీర్ 2,625వ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సోమవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో వారు మాట్లాడుతూ.. 31న ఉదయం 9 గంటలకు తాడ్బండ్ హనుమాన్ దేవాలయం నుంచి సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్ వరకు మహావీరుని రథయాత్ర (వర్గోద), అనంతరం ఆధ్యాత్మిక ధర్మసభ జరుగుతాయని, భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
