
ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ సంస్థ పలువురి సెలబ్రెటీల మైనపు విగ్రహాలని తయారు చేసి ప్రజల సందర్శనార్ధం సింగపూర్లోని మ్యూజియంలో స్టోర్ చేస్తుంది. ఇందులో దక్షిణాది హీరోలలో ప్రభాస్ తర్వాత మహేష్కు మాత్రమే ఆ గౌరవం దక్కింది. మహేష్ అభిమానుల సందర్శనం కోసం మార్చి 25న ఆయన వ్యాక్స్ విగ్రహాన్ని ఆ సంస్థ నిర్వాహకులు హైదరాబాద్కు తీసుకురానున్నారు. మహేష్ మల్టీ ప్లెక్స్ సంస్థ ఏఎంబి సినిమాస్లో ఈ విగ్రహాన్ని ఒక్క రోజు ఉంచనున్నారు. తర్వాత సింగపూర్ తరలించి టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచనున్నారు.