అగ్ని వీరులకు మహీంద్రా గ్రూప్ గుడ్ న్యూస్

అగ్ని వీరులకు మహీంద్రా గ్రూప్ గుడ్ న్యూస్

కేంద్రం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ సైనిక నియామక పథకంపై దేశవ్యాప్తంగా నెలకొన్న అలజడి నేపథ్యంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఓ కీలక ప్రకటన చేశారు. అగ్నిపథ్ పథకం కింద శిక్షణ పొందిన, సమర్థులైన యువకులను రిక్రూట్ చేసుకునే అవకాశాన్ని మహీంద్రా గ్రూప్ ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ పథకం నేపథ్యంలో గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన క్రమంలో మహీంద్రా ఈ ప్రకటనను వెల్లడించారు.ఈ స్కీం వల్ల నెలకొన్న హింసాకాండను చూసి, తాను చాలా బాధపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు.  అగ్నివీర్స్ కావడానికి వారు పొందే శిక్షణ, నేర్చుకున్న క్రమశిక్షణ, నైపుణ్యాలు ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయని తాను గత సంవత్సరం ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడే చెప్పానని ఆనంద్ మహీంద్రా ఈ సందర్భంగా గుర్తు చేశారు.