సందేశాత్మక కథతో మహిషాసురుడు

సందేశాత్మక కథతో మహిషాసురుడు

ప్రముఖ కార్డియాలజిస్ట్ ఎస్.గురుప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రం ‘మహిషాసురుడు’. వినోద్, రిచా కర్లా, ధరణి రెడ్డి జంటగా నటించారు. రవికుమార్ గోనుగుంట దర్శకుడు. ఈ మూవీ ఆడియో రిలీజ్ వేడుక  బుధవారం ఫిలిం ఛాంబర్‌‌‌‌లో జరిగింది.  తమ్మారెడ్డి భరద్వాజ, తనికెళ్ళ భరణి, రేలంగి నరసింహారావు, గౌతం రాజు అతిథులుగా హాజరై ఆడియోను ఆవిష్కరించారు. ‘సమాజం పట్ల బాధ్యతగా ఒక సందేశాన్ని అందించాలని డా.గురుప్రసాద్ మంచి కంటెంట్‌‌తో తీసిన ఈ చిత్రం సక్సెస్ సాధించాలని అతిథులంతా కోరారు. గురు ప్రసాద్ మాట్లాడుతూ ‘వైద్య పరికరాల విషయంలో  కోట్లు ఖర్చు చేసి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బదులు మన దేశంలోనే తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చనే పాయింట్‌‌తో ఈ సినిమాను తీశాం’ అన్నారు. దర్శకుడు రవికుమార్, మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ సాయిరామ్, విలన్ ఆర్టిస్ట్ నవీన్ రాజు,  నటుడు హరిబాబు తదితరులు పాల్గొన్నారు.