నా పెంపుడు పాము చచ్చిపోయింది.. యువతి ఎమోషనల్ పోస్ట్

నా పెంపుడు పాము చచ్చిపోయింది.. యువతి ఎమోషనల్ పోస్ట్

 రాను రాను జనాలు సమాజంలో పాపులర్​ కావడానికి వారు పడే తాపత్రయం అంతా ఇంతా కాదు.  సోషల్​ మీడియా వచ్చిన తరువాత ప్రతి చిన్న విషయాన్ని సోషల్​ మీడియాలో పోస్ట్​ చేస్తున్నారు.  కొంతమంది ఈ రోజు ఏ కూర తిన్నామో కూడా పోస్ట్​ చేస్తున్నారు.  అంటే సోషల్​ మీడియా..​ ఎంతలా ఎదిగిందో వేరే చెప్పనక్కరలేదు.  ఇప్పుడు తాజాగా ఓ మహిళ ఇన్​స్ట్రాలో చేసిన పోస్ట్​ లో నా పెంపుడు పాము చనిపోయిందంటూ ఆ యువతి ఎమోషనల్​ గా చేసిన పోస్ట్​ వైరల్​ అవుతుంది. 

సోషల్​ మీడియాలో పోస్ట్​ చేసిన వీడియోలో మహిళ ఓ పామును ముద్దుపెట్టుకుంటా.. ఈ కోబ్రాను తన కొడుకుగా భావించానని.. ఆ పాము మరణాన్ని తట్టుకోలేకపోతున్నానని విచారకరమైన పోస్ట్​ ను రాశారు.  మలయ్​ భాషలో రాసిన క్యాప్షన్​ ఉంది కాబట్టి మలేషియాకు చెందిన మహిళగా భావించవచ్చు.   ఆ మహిళ కింగ్​ కోబ్రానుదగ్గరగా తీసుకొని ముద్దు పెట్టుకుంటూ  ఈ పాము ( నాకొడుకు) లేకుండా నేను ఉండలేనని భావోద్వేగంగా పోస్ట్​ ఉంది.  చాలా సంవత్సరాలు  జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. ఈ రోజు తాను ఇలా ఉన్నానంటే.. అది దాని వల్లేననని రాశారు.  ఈ పోస్టులో పాముకు వీడ్కోలు పలికింది.  ఈ వీడియో వైరల్​ కావడంతో నెటిజన్లు స్పందించారు.  ఈ వీడియోకు 5 కోట్లకు పైగా వీక్షణలు వచ్చాయి.  ఈ అమ్మాయి వీడియోలు పోస్ట్​ చేయడం మానేసే రోజు వస్తుందని కొంతమంది కామెంట్​ చేశారు.  మరొకరు నాగుపాము కూడా ఆమె విషానికి భయపడిందా అని ప్రశ్నించారు.