
పేట, మాస్టర్ లాంటి తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ గుర్తింపును అందుకుంది మాళవిక మోహనన్. మలయాళ చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన ఆమె.. తమిళంలో వరుస అవకాశాలను అందుకుంది. కానీ తెలుగు సినిమాలో నటించడానికి మాత్రం చాలా టైమ్ పట్టింది. ప్రస్తుతం ప్రభాస్కి జంటగా మారుతి సినిమాలో నటిస్తోంది. మరోవైపు మలయాళంలోనూ ఓ సినిమా చేస్తోంది. మాథ్యూ థామస్కు జంటగా ఆమె నటిస్తున్న ఈ చిత్రానికి ‘క్రిస్టి’ అనే టైటిల్ను ఫైనల్ చేశారు.
‘ఎక్కడైతే నది ప్రేమతో సముద్రాన్ని కలుస్తుందో’ అనే క్యాప్షన్తో ఫస్ట్ లుక్, టైటిల్ను రిలీజ్ చేశారు. పృథ్వీరాజ్, మంజు వారియర్, జయసూర్య, టోవినో థామస్ లాంటి పలువురు మలయాళ సెలెబ్రిటీస్ సోషల్ మీడియా ద్వారా లాంచ్ చేశారు. అల్విన్ హెన్రీ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. సజయ్ సెబాస్టియన్, కన్నన్ సతీశన్ నిర్మాతలు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రొమాంటిక్ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. తన మనసుకు ఎంతో దగ్గరైన సినిమా ఇదని చెబుతోంది మాళవిక.