టీ20ల్లో రికార్డు..8 పరుగులిచ్చి 7 వికెట్లు

టీ20ల్లో రికార్డు..8 పరుగులిచ్చి 7 వికెట్లు

కౌలాలంపూర్‌‌‌‌‌‌‌‌: మలేసియాకు చెందిన సీమర్‌‌‌‌‌‌‌‌ స్యాజ్రుల్‌‌‌‌‌‌‌‌ ఇద్రుస్‌‌‌‌‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ టీ20ల్లో రికార్డు సృష్టించాడు.  మెన్స్‌‌‌‌‌‌‌‌ టీ20 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఏడు వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌‌‌‌‌‌‌‌గా చరిత్రకెక్కాడు. టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ ఆసియా బి క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో భాగంగా బుధవారం చైనాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో అతను ఈ ఘనత సాధించాడు. ఎనిమిది రన్స్‌‌‌‌‌‌‌‌ మాత్రమే ఇచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడు వికెట్లు బౌల్డ్‌‌‌‌‌‌‌‌ ద్వారా వచ్చినవే కావడం విశేషం. 

ఈ క్రమంలో 2021లో సియెరా లియోన్‌‌‌‌‌‌‌‌ జట్టుతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో  5 రన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చి ఆరు వికెట్లు తీసిన నైజీరియా బౌలర్‌‌‌‌‌‌‌‌ పీటర్‌‌‌‌‌‌‌‌ ఎహో రికార్డును ఇద్రుస్ బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఇద్రుస్‌‌‌‌‌‌‌‌ దెబ్బకు చైనా 11.2 ఓవర్లలో 23 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది.  మలేసియా 4.5 ఓవర్లలోనే 24/2 స్కోరు చేసి ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది.