బీజేపీ రాష్ట్ర ఇన్​చార్జి​లతో మల్క కొమురయ్య భేటీ

బీజేపీ రాష్ట్ర ఇన్​చార్జి​లతో మల్క కొమురయ్య భేటీ

హైదరాబాద్, వెలుగు: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంపై అన్ని రకాల ఫ్లాట్​ఫామ్​ల ద్వారా ప్రచారం చేస్తున్నట్లు ఢిల్లీ పబ్లిక్​స్కూల్స్, పల్లవి గ్రూప్​ఆఫ్ స్కూల్స్ చైర్మన్ మల్కా కొమురయ్య తెలిపారు. తెలంగాణ బీజేపీ ఇన్ చార్జ్​లు తరుణ్​చుగ్, సునీల్​బన్సల్, కో ఇన్ చార్జ్​అరవింద్​మేనన్ తో విడివిడిగా భేటీ అయ్యారు. లోక్​సభ ఎన్నికలపై రాష్ట్ర బీజేపీ నేతలతో చర్చించేందుకు వారు మంగళవారం హైదరాబాద్​ వచ్చారు. 

ఈ సందర్భంగా వారితో సమావేశమైన కొమురయ్య.. జనవరి 22న జరగనున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంపై చేపడుతున్న ప్రచారాన్ని వివరించారు. కార్యక్రమ ప్రాముఖ్యతను ప్రతి ఇంటికి చేర్చేలా వాల్​పోస్టర్, మీడియా, సోషల్​మీడియా ఇలా అన్ని రకాల ఫ్లాట్​ఫామ్​లను వినియోగిస్తున్నట్లు తెలిపారు. వారికి రామాలయ చిన్న ప్రతిరూపాన్ని, అక్షింతలను అందజేశారు.