
హైదరాబాద్, వెలుగు: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంపై అన్ని రకాల ఫ్లాట్ఫామ్ల ద్వారా ప్రచారం చేస్తున్నట్లు ఢిల్లీ పబ్లిక్స్కూల్స్, పల్లవి గ్రూప్ఆఫ్ స్కూల్స్ చైర్మన్ మల్కా కొమురయ్య తెలిపారు. తెలంగాణ బీజేపీ ఇన్ చార్జ్లు తరుణ్చుగ్, సునీల్బన్సల్, కో ఇన్ చార్జ్అరవింద్మేనన్ తో విడివిడిగా భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికలపై రాష్ట్ర బీజేపీ నేతలతో చర్చించేందుకు వారు మంగళవారం హైదరాబాద్ వచ్చారు.
ఈ సందర్భంగా వారితో సమావేశమైన కొమురయ్య.. జనవరి 22న జరగనున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంపై చేపడుతున్న ప్రచారాన్ని వివరించారు. కార్యక్రమ ప్రాముఖ్యతను ప్రతి ఇంటికి చేర్చేలా వాల్పోస్టర్, మీడియా, సోషల్మీడియా ఇలా అన్ని రకాల ఫ్లాట్ఫామ్లను వినియోగిస్తున్నట్లు తెలిపారు. వారికి రామాలయ చిన్న ప్రతిరూపాన్ని, అక్షింతలను అందజేశారు.