రూ.4.5 లక్షలకు చిన్నారిని అమ్మేందుకు యత్నం

రూ.4.5 లక్షలకు చిన్నారిని అమ్మేందుకు యత్నం
  • ఆరుగురిని అరెస్ట్ చేసిన ఎస్‌‌‌‌ఓటీ పోలీసులు
  • రెస్క్యూ చేసిన బాలుడిని శిశువిహార్‌‌‌‌‌‌‌‌కి తరలింపు

హైదరాబాద్‌‌‌‌,వెలుగు : చిన్నారిని అమ్మేందుకు యత్నించిన గ్యాంగ్‌‌‌‌ను మల్కాజిగిరి జోన్ ఎస్‌‌‌‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. రెస్క్యూ చేసిన బాబును శిశువిహార్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. కీసర పోలీసులు తెలిపిన ప్రకారం.. బండ్లగూడలో బాలుడిని అమ్ముతున్నట్టు ఎస్‌‌‌‌ఓటీ పోలీసులకు శనివారం సమాచారం అందింది.

దీంతో బండ్లగూడ ఆర్‌‌‌‌‌‌‌‌జేకే కాలనీలో పోలీసులు సోదాలు చేశారు. ఫ్లాట్‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌18లో హెప్పిబా అలియాస్ అనిత అనే మహిళ ఇంట్లో వెంకట్‌‌‌‌లోకేశ్(4 నెలలు)ను అమ్మేందుకు యత్నిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. రూ.4.50లక్షలకు అమ్మకానికి పెట్టినట్టు గుర్తించారు.

ఏపీలోని నంద్యాలకు చెందిన మీసాల ప్రసన్న, మీసాల ప్రహ్లాద్‌‌‌‌, బాలనరసమ్మ అలియాస్‌‌‌‌ లక్ష్మి మధ్యవర్తులు సనా, భానుకుమార్‌‌‌‌‌‌‌‌లతో పాటు అనితను అరెస్ట్ చేశారు. ఆ బాబు ప్రసన్న, ప్రహ్లాద్‌‌‌‌ల కొడుకుగా పట్టుబడినవారు పోలీసులకు చెప్పారు. వెంకట్‌‌‌‌ లోకేశ్​వీరి కుమారుడేనా లేక ఎక్కడైనా కిడ్నాప్ చేసి తీసుకొచ్చి విక్రయిస్తున్నారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాబును శిశువిహార్‌‌‌‌‌‌‌‌కి తరలించారు. పోలీసులు పట్టుబడిన గ్యాంగ్‌‌‌‌ వివరాలను తెలుసుకుంటున్నారు.