మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థినిపై రేప్

మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థినిపై రేప్

దిశ రేప్, మర్డర్ ఘటన ఇంకా మర్చిపోకముందే హైదరాబాద్‌ నగరంలో మరో అత్యాచార ఘటన కలకలం రేపుతోంది. మేడ్చల్‌లోని ఓ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థినిపై కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రేప్ చేశాడు. ఈ ఘటనపై ఆ యువతి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పేట్ బషీరాబాద్‌కు చెందిన ఓ యవతి (19) మేడ్చల్‌ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ఇంజినీరింగ్ సెకండియర్ చదువుతోంది. కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటయ్య తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ యువతి. సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ల్యాబ్‌కి పిలిచి తలుపులు వేసి బలవంతంగా అత్యాచారం చేశాడని పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసుకుని ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రి తరలించారు.

More News:

రేప్‌లు జరగొద్దంటే.. మగవాళ్లు ఇలా చేయాలి!

స్నైపర్‌తో కాల్చినా సేఫ్: ఫుల్ బాడీ బుల్లెట్ ప్రూఫ్ తయారుచేసిన ఆర్మీ మేజర్

CAAపై బీజేపీలో వ్యతిరేక గళం.. పౌరసత్వానికి, మతంతో లింక్ ఏంటీ?