కాంగ్రెస్ చీఫ్ రేసులో ఖర్గే.. దిగ్విజయ్ సింగ్ ఔట్!

కాంగ్రెస్ చీఫ్ రేసులో ఖర్గే.. దిగ్విజయ్ సింగ్ ఔట్!

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. శశిథరూర్, దిగ్విజయ్ సింగ్ అధ్యక్ష బరిలో నిలిచేందుకు సిద్ధం కాగా.. అనూహ్యంగా ఖర్గే పేరు తెరపైకి వచ్చింది.  ఒకవేళ ఖర్గే అధ్యక్ష పదవికి ఎన్నికైతే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశం ఉంది. 
  
మల్లిఖార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడుతుండడంతో దిగ్విజయ్ సింగ్ పోటీ నుంచి తప్పుకునే అవకాశం కనిపిస్తోంది. జీ 23 నేతల్లో ఒకరైన భూపేందర్ సింగ్ హుడా ఖర్గేకు మద్ధతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నామినేషన్ కు ఈ రోజు తుది గడువు కావడంతో బరిలో ఎవరెవరున్నారన్న అంశంపై స్పష్టత వచ్చే అవకాశముంది. వాస్తవానికి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అధ్యక్ష రేసులో ముందుండగా.. ఆయన వర్గ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే జీ 23 నేతల్లో ఒకరైన ముకుల్ వాస్నిక్ సైతం కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేసులో ఉన్నట్లు సమాచారం.