న్యూఢిల్లీ: కాంగ్రెస్ వెటరన్ నేత గులాం నబీ ఆజాద్ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. దీంతో రాజ్యసభలో విపక్ష నేత (లీడర్ ఆఫ్ అపోజిషన్) స్థానం ఖాళీ అయ్యింది. ఆజాద్ తర్వాత డిప్యూటీ లీడర్గా వున్న మరో సీనియర్ నేత ఆనంద శర్మ ఈ పదవికి నియమితులవుతారని అంతా భావించారు. అయితే ఈ ప్లేస్ను మరో సీనియర్ లీడర్ మల్లికార్జున ఖర్గేతో భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఖర్గేను విపక్ష నేతగా పేరును ప్రతిపాదిస్తూ రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడుకు కాంగ్రెస్ లేఖ రాసింది. ఈ నెల 15తో ఆజాద్ పదవీ కాలం ముగుస్తుంది. ఆ తర్వాత నుంచి ఖర్గే విపక్ష నేతగా వ్యవహరించనున్నారు. ఆజాద్ పదవీ విరమణ విషయం తెరమీదికి వచ్చినప్పట్నించి సీనియర్లు అయిన దిగ్విజయ్ సింగ్, ఆనంద్ శర్మ, చిదంబరం, కపిల్ సిబాల్ వంటి నాయకుల పేర్లు విపక్ష నేత స్థానం రేసులో వినిపించాయి. ఆనంద్ శర్మకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఖర్గేకు ఆ పదవి దక్కడం గమనార్హం.
విపక్ష నేతగా ఖర్గేకు చాన్స్.. సీనియర్లకు మొండిచెయ్యి
- దేశం
- February 12, 2021
లేటెస్ట్
- హాస్పిటళ్లా? అపార్ట్మెంట్ టవర్లా?
- ఫ్యామిలీ వివరాల నమోదుకు ప్రత్యేక యాప్
- బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న హేమ
- చత్తీస్గఢ్లో ఎన్కౌంటర్..ఏడుగురు మావోయిస్టులు మృతి
- డ్రైవింగ్ స్కూళ్లలోనూ టెస్టు.. డ్రైవింగ్ లైసెన్స్లో కొత్త రూల్స్
- జూన్30 లోపు కాళేశ్వరం రిపేర్లు!
- తెలంగాణలో ఇక అక్రమ దందాలు నడువయ్
- ప్రీతిస్మిత రికార్డు గోల్డ్
- రైజర్స్ x రాయల్స్ ..ఫైనల్ చేరేదెవరు?
- సీఎం రేవంత్ VS కెసిఆర్ - వరి | హేమ -రేవ్ పార్టీ | రాహుల్ గాంధీ మహిళలకు భరోసా | కోమటిరెడ్డి-బిఆర్ఎస్ |V6
Most Read News
- Good Health: ఈ ఆకులు తిన్నారా.. మోకాళ్ల నొప్పులు మాయం...
- మూతపడనున్న మరో రెండు సింగరేణి బొగ్గు గనులు
- పెద్దపల్లి-మణుగూరు రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్
- అలర్ట్ : బంగాళాఖాతంలో అల్పపీడనం. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు
- రైతులకు అగ్రికల్చర్ వర్సిటీ విత్తనాలు
- జిల్లాల ఏకీకరణ అవసరమా?
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. భారీ వర్షాలు పడే అవకాశం
- తెలంగాణలో ఇయ్యాల్టి నుంచి మూడు రోజులు వానలు
- అంబానీ ఇంటి పెండ్లికి కరీంనగర్ కానుకలు
- మహానటి : హేమ డ్రగ్స్ తీసుకున్నారు.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది..