
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆదివారం జరిగిన ఇంటర్మీడియెట్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో 26 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. దీంట్లో ఫస్టియర్ లో 17, సెకండియర్ లో 9 మంది ఉన్నారని ఇంటర్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. వారిలో 22 మంది సంగారెడ్డి జిల్లాకు చెందిన వారు. కాగా.. ఆదివారం మ్యాథ్స్ బీ, జువాలజీ, హిస్టరీ సబ్జెక్టులకు సప్లిమెంటరీ ఎగ్జామ్ జరిగింది. ఉదయం ఫస్టియర్ విద్యార్థులకు ఎగ్జామ్ జరగ్గా.. 1,26,290 మందికి 1,18,114 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెకండియర్ విద్యార్థులకు జరిగిన పరీక్షల్లో 58,890 మందికి 55,841 మంది హాజరయ్యారు.