
కవులు, కళాకారులు, స్వచ్ఛంద సంస్థల్ని టార్గెట్ చేసి ఫేక్ డాక్టరేట్లు ప్రదానం చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్న వ్యక్తిని సోమవారం (అక్టోబర్ 06) పోలీసులు అరెస్టు చేశారు. రవీంద్రభారతి వంటి పేరు గాంచిన కళాక్షేత్రాలలో డాక్టరేట్లు ఇస్తూ డబ్బులు దండుకుంటున్నాడన్న సమాచారంతో అరెస్ట్ చేశారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.
వివరాల్లోకి వెళ్తే.. పెద్దిటి యోహాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. యోహాన్ నుంచి ఫేక్ డాక్టరేట్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. డాక్టరేట్లు ఇస్తానని చెప్పి ఒక్కొక్కరి నుంచి 15వేల నుంచి 20వేల రూపాయలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఆదివారం ‘అక్టోబర్ 05) రవీంద్ర భారతిలో ఫేక్ డాక్టరేట్లు ప్రదానం చేసిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు. గుర్రం జాషువా స్మారక కళా పరిషత్ పేరుతో పెద్దిటి యోహాన్ గత కొంతకాలంగా డాక్టరేట్లు , అవార్డులు ప్రదానం చేస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్ కవులు, కళాకారులే టార్గెట్:
ఆంద్రప్రదేశ్ కు చెందిన కవులు, కళాకారులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి డాక్టరేట్లు ఇస్తామని నమ్మపాలికాడు. డాక్టరేట్ తీసుకున్న ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిరారు.
పెద్దిటి యోహాన్ పై BNS యాక్ట్ 318 క్లాస్ 4 చీటింగ్ కేసు నమోదు చేశారు సైఫాబాద్ పోలీసులు. పెద్దిటి యోహాన్ వయస్సు 75 సంవత్సరాలు. గుంటూరు జిల్లా గురుజాలకు చెందిన వ్యక్తి.