విశాఖపట్నంలో భార్య, కూతురిని చంపి ఆత్మహత్య చేసుకున్నాడో వ్యక్తి. మధురవాడలో ఉండే… సాక్రజిత్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాడు. నిన్న సాయంత్రం భార్య, కూతురిని చంపి… తన తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. ఆ తర్వాత రైలు కింద పడి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు
మధురవాడలోని జాహ్నవి ఎన్క్లేవ్ ప్లాట్ నెం.101లో నివాసం ఉంటున్న సాక్రజిత్ కు ఓ భార్య, ఓ పాప. నాలుగున్నర సంవత్సరాల నుండి అదే ప్లాట్ లో అద్దెకుంటున్న సాక్రజిత్ కుటుంబ సమస్యల కారణంగా శనివారం భార్యా, కూతుర్ని చంపేశాడు. అనంతరం తన తల్లికి ఫోన్ చేసి “కోడలిని, మనవరాలిని చంపి ఫ్లాట్ లో ఉంచాను, వెళ్లి కలెక్ట్ చేసుకోండి.” అని చెప్పి తాను కూడా రైలు కిందపడి చనిపోయాడు. అతని తల్లి వెంటనే పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పీఎం పాలెం సీఐ, ఎస్సై శ్రీనివాస్ అతని నివాసానికి వెళ్లి, తాళం పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా వంట గదిలో భార్య, బాత్రూంలో పాప చనిపోయి ఉన్నారు. సాక్రజిత్ సొంతూరు రోర్కెళ , ఒరిస్సా రాష్ట్రం.